News February 5, 2025

చర్చనీయాంశంగా మారిన దేవినేని ఉమ ట్వీట్

image

ట్విటర్, వేదికగా రేషన్ మాఫియాపై మాజీమంత్రి దేవినేని ఉమ సంచల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, విజయవాడ సిటీ పోలీస్, ఎన్టీఆర్ కలెక్టర్‌ని ట్యాగ్ చేశారు. వైసీపీ హయాంలో దోపిడీ చాలదన్నట్లు ఇంకా మైలవరంలో రేషన్ దోపిడీ అంటూ పోస్ట్ చేశారు. మాఫియా ఆట కట్టిస్తామని అన్నారు. 2 రోజుల క్రితం ఓ వాహనంలో పోలీసుల తనిఖీలో మైలవరంలో పట్టుబడిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం వేదికగా రాజకీయం ముదురుతోంది. 

Similar News

News December 15, 2025

రాజమండ్రి: రేపటి నుంచి ఉర్దూ స్వర్ణోత్సవ వారోత్సవాలు

image

ఉర్దూ అకాడమీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ఉర్దూ అకాడమీ ప్రతినిధి నస్రీన్ ఫాతిమాతో కలిసి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందరూ వీటిని విజయవంతం చేయాలని కోరారు.

News December 15, 2025

వంగూరు: కొత్త విద్యుత్ మోటార్ ఏర్పాటు చేసిన సర్పంచ్

image

వంగూరు మండలం గాజర సర్పంచ్ పులిగిల్ల శ్రీపతిరావు సోమవారం ఈదమ్మ గుడి వద్ద నూతన విద్యుత్ మోటర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. సర్పంచ్ పి.శ్రీపతిరావు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్‌గా గెలిచిన అనంతరం మోటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు చింతకుంట్ల సైదులు, కటికర్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ సునీత కొండల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

News December 15, 2025

మెదక్: నాడు గెలిచి.. నేడు ఓడిన దంపతులు

image

మెదక్ మండలం మాచవరం గ్రామపంచాయతీ ఎన్నికపై అందరి దృష్టి ఆకర్షించే విషయం తెలిసిందే. ఇక్కడ గత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా విజయం సాధించిన దంపతులు ఈసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సర్పంచిగా సంధ్యారాణి, వార్డు సభ్యులుగా శ్రీనివాస్ చౌదరి గెలుపొందారు. ఈసారి సర్పంచ్ పదవికి శ్రీనివాస్ చౌదరి, వార్డు సభ్యులు పదవికి సంధ్యా రాణి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇక్కడ సాంబశివరావు గెలుపొందారు.