News February 5, 2025

చర్చనీయాంశంగా మారిన దేవినేని ఉమ ట్వీట్

image

ట్విటర్, వేదికగా రేషన్ మాఫియాపై మాజీమంత్రి దేవినేని ఉమ సంచల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, విజయవాడ సిటీ పోలీస్, ఎన్టీఆర్ కలెక్టర్‌ని ట్యాగ్ చేశారు. వైసీపీ హయాంలో దోపిడీ చాలదన్నట్లు ఇంకా మైలవరంలో రేషన్ దోపిడీ అంటూ పోస్ట్ చేశారు. మాఫియా ఆట కట్టిస్తామని అన్నారు. 2 రోజుల క్రితం ఓ వాహనంలో పోలీసుల తనిఖీలో మైలవరంలో పట్టుబడిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం వేదికగా రాజకీయం ముదురుతోంది. 

Similar News

News February 23, 2026

జగిత్యాల: ‘మాదకద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం’

image

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర చర్చ జరిగింది. విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా, యువతలో అవగాహన కార్యక్రమాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

News February 23, 2026

పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్: CBN

image

AP: పనితీరు సరిగా లేని ఉద్యోగులను మోటివేట్ చేయడంతోపాటు పని చేస్తున్న వారిని ప్రోత్సహించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘ప్రతినెల ఉద్యోగుల పనితీరును మదింపు చేయాలి. బాగా పనిచేస్తున్న వారికి అభినందన లేఖ పంపాలి. ఇకపై పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలి. వ్యక్తిగత రికార్డుల్లో ఆ పాయింట్లు నమోదు చేయాలి’ అని వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో CM సూచించారు. రెవెన్యూ శాఖపై ఉన్న చెడ్డపేరు పోవాలన్నారు.

News February 23, 2026

అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 45 కేంద్రాల్లో 8,157 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.