News January 20, 2025

చర్లపల్లి: మరో 8 రైళ్లు నడిపేందుకు నిర్ణయం

image

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్ నుంచి మార్చిలో మరో 8 రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చర్లపల్లి టర్మినల్ నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడానికి పచ్చ జెండా ఊపింది.

Similar News

News November 4, 2025

GHMC పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలు

image

జీహెచ్ఎంసీ పరిధిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం కాప్రా GHMC కార్యాలయంలో నమోదైంది. షేక్‌పేట్ గౌతమ్‌నగర్ ఫంక్షన్ హాల్ వద్ద 4.5 మిల్లీమీటర్లు, బాలానగర్ ఓల్డ్ సుల్తాన్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. రేపు సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది.

News November 4, 2025

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం

image

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు షేక్‌పేట్ డివిజన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కార్నర్‌ మీటింగ్‌కు హాజరవనున్నారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్‌ షోతోపాటు కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.

News November 4, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు

image

HYD బుద్ధభవన్‌లో నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారన్నారు. మల్లాపూర్,సాయినగర్, ఎంఎర్‌టౌన్‌షిప్, మణికొండ, గుట్టలబేగంపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడాలని కోరారని, చర్యలు తీసుకుంటామన్నారు.