News February 6, 2025
చర్లలో ఉరేసుకుని యూపీ వాసి మృతి

బాత్రుంలో వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన చర్ల మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. UP చౌటీర్యాలీకి చెందిన అమర్ సింగ్ పానీపూరి బండితో జీవనం సాగిస్తున్నాడు. గత 2 రోజులుగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడుతున్నాడు. మనస్తాపంతో బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రూం నుంచి బయటికి రాకపోయేసరికి భార్య ప్రీతి వెళ్లి చూడగా ఉరేసుకుని ఉన్నాడు.
Similar News
News March 15, 2026
దొరమామిడి జలాశయంలో గల్లంతైన మృతదేహాల లభ్యం

బుట్టాయగూడెం మండలం దొరమామిడి జలాశయంలో ఆదివారం ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన తుమ్మల నాగరాజు (30), తుమ్మల రమణ (35) గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లారు. అనంతరం వారు జలాశయం స్నానం చేస్తుండగా వారు గల్లంతయ్యారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు.
News March 15, 2026
ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం ఉంటుందని APSDMA అంచనా వేసింది. ద్రోణి, నైరుతి నుంచి వీచే గాలులతో రేపు SKLM, VZM, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసేందుకు ఆస్కారం ఉందని చెప్పింది.
News March 15, 2026
పులిని పట్టుకునేందుకు ‘హనుమాన్’ బృందాలు: డిప్యూటీ సీఎం ఆదేశం

జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులిని పట్టుకునేందుకు 10 హనుమాన్ బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆదివారం అధికారులతో మాట్లాడిన ఆయన, కూర్మాపురం తరహాలోనే పులిని బంధించి విశాఖ జూకు తరలించాలని సూచించారు. ఈ ఆపరేషన్ పర్యవేక్షణ బాధ్యతను సీసీఎఫ్ చలపతిరావుకు అప్పగించారు. పులి భయం లేకుండా ప్రజలకు భద్రత కల్పించాలని అటవీ శాఖను ఆదేశించారు.


