News February 7, 2025

చర్ల: కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని హత్య చేసిన మావోయిస్టులు..!

image

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు హత్య చేసిన ఘటన చర్ల మండల సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో జరిగింది. అరన్‌పూర్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా జోగా బోర్సే బరిలో ఉన్నారు. శుక్రవారం మావోయిస్టులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేశారని సమాచారం. దీంతో జోగా బర్సేను హత్య చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News March 17, 2025

జనగామ: ఇంటర్మీడియట్ పరీక్షల సరళి పరిశీలించిన కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని సోమవారం జనగామ జిల్లాలోని ధర్మకంచలోని ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరును అధికారుల నుంచి తెలుసుకున్నారు.

News March 17, 2025

రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్‌లైన్లో దరఖాస్తులు ఆహ్వానం: శైలజ

image

BHPL జిల్లాలో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన “రాజీవ్ యువ వికాసం పథకం” ప్రకటించిందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి శైలజ తెలిపారు. కావున అర్హత, ఆసక్తి కలవారు OBMMS ఆన్‌లైన్ పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని ఆమె ప్రకటనలో తెలిపారు.

News March 17, 2025

BHPL: ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ 

image

ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. పరిష్కరించబడిన ఫిర్యాదులపై వచ్చేవారం సమగ్ర నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు.

error: Content is protected !!