News March 20, 2025

చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికం..!

image

నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.3°C ఉష్ణోగ్రత నమోదవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్చిలోనే 42.3°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

Similar News

News October 22, 2025

భారీ వర్షసూచన.. మరో 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: రాయలసీమతో పాటు పలు జిల్లాలకు వాతావరణశాఖ రేపు భారీ వర్షసూచన చేసింది. ఈ నేపథ్యంలో మరో 2 జిల్లాల స్కూళ్లకు సెలవులిచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కడప డీఈవో శంషుద్దీన్, అన్నమయ్య డీఈవో సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు రేపు స్కూళ్లకు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ GNT, కృష్ణా, చిత్తూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

News October 22, 2025

‘సిరిని తెచ్చే సింహ ద్వారం ఎంతో ముఖ్యం’

image

సింహ ద్వారం వాస్తు నియమాల ప్రకారం ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. మనిషికి ముఖం ఎలాగో ఇంటికి సింహద్వారం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. ‘సింహద్వారం ఇంటి దిక్కుకు అభిముఖంగా, మధ్యభాగంలో ఉండాలి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండాలి. సింహద్వారం ఇంటికి అందంతో పాటు అదృష్టాన్ని తెస్తుంది. సింహ ద్వారం విషయంలో నిర్లక్ష్యం వద్దు’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>

News October 22, 2025

సన్న రకానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్: అది శ్రీనివాస్

image

ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రకటించారు. బుధవారం చందుర్తి మండలం, సనుగుల గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఆయన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.