News March 20, 2025

చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికం..!

image

నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.3°C ఉష్ణోగ్రత నమోదవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్చిలోనే 42.3°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

Similar News

News March 30, 2025

అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించాలని అధికారులను సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, అధికారులు పాల్గొన్నారు.

News March 30, 2025

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ

image

రాష్ట్ర ప్రజానీకం, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. 

News March 30, 2025

ఆర్మీ ఫలితాలు.. ముగ్గురు స్నేహితులకు ఉద్యోగాలు

image

నిన్నటి రోజున విడుదలైన ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఫలితాలలో పామిడికి చెందిన ముగ్గురు స్నేహితులు షాహిద్, మంజునాథ్, మొహమ్మద్ గౌస్ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. వారు మాట్లాడుతూ.. తాము ఈ ఉద్యోగం సాధించడానికి శిక్షకుడు వినయ్ కుమార్ రెడ్డి సహకారం ఎంతగానో తోడ్పడిందని తెలిపారు. ఉద్యోగాలు సాధించడం పట్ల వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.

error: Content is protected !!