News April 5, 2025

చాట్రాయి: ఆలయానికి చేరిన భద్రాది రామయ్య అక్షింతలు

image

భద్రాచలం రామాలయం నుంచి చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన కోదండ రామాలయానికి తలంబ్రాలు చేరుకున్నాయి. ప్రతి ఏటా భద్రాచలం రాములోరి అక్షింతలనే సీతారామ కళ్యాణానికి వినియోగించడం ఆనువాయితీగా వస్తోంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, పూజారి మారుతి తలంబ్రాలను సేకరించి స్వామివారి వద్ద భద్రపరిచారు. తలంబ్రాలను శనివారం పంపించానున్నారు.

Similar News

News December 20, 2025

బిగ్‌బాస్ విజేత ఎవరు?

image

బిగ్‌బాస్-9 విజేత ఎవరో రేపు తేలిపోనుంది. ఇవాళ్టి నుంచి టాప్-5 కంటెస్టెంట్లు ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజ, డెమాన్, సంజనలో ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు. చివరికి టాప్-2లో నిలిచే ఇద్దరిలో విన్నర్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తవగా కళ్యాణ్ టాప్ ప్లేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అటు తొలిసారి ఫీమేల్ విజేతగా తనూజ నిలవనున్నారని ప్రచారం జరుగుతోంది. విన్నర్ ఎవరవుతారో మీరూ గెస్ చేయండి.

News December 20, 2025

నల్లమలలో పులి సంచారం.. కృష్ణాతీర గ్రామాల్లో హైఅలర్ట్

image

<<18614933>>పెద్దపులి<<>> దారి తప్పి కొల్లాపూర్ నల్లమల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కృష్ణానదీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 3 రోజులుగా పెద్దపులి సంచరిస్తుందని వదంతులు రాగా.. సోమశిల, యంగంపల్లి, అమరగిరిలో పెద్దపులి జాడలు కనిపించయని కొల్లాపూర్ రేంజ్ అధికారి హుస్సేన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పెద్దపులిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

News December 20, 2025

ఈ కలుపు మందులతో వయ్యారిభామ నిర్మూలన

image

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.