News April 5, 2025
చాట్రాయి: ఆలయానికి చేరిన భద్రాది రామయ్య అక్షింతలు

భద్రాచలం రామాలయం నుంచి చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన కోదండ రామాలయానికి తలంబ్రాలు చేరుకున్నాయి. ప్రతి ఏటా భద్రాచలం రాములోరి అక్షింతలనే సీతారామ కళ్యాణానికి వినియోగించడం ఆనువాయితీగా వస్తోంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, పూజారి మారుతి తలంబ్రాలను సేకరించి స్వామివారి వద్ద భద్రపరిచారు. తలంబ్రాలను శనివారం పంపించానున్నారు.
Similar News
News December 11, 2025
ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో 377 నిబంధన కింద టీచర్ల సమస్యను ఏలూరు ఎంపీ లేవనెత్తారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పార్లమెంట్లో ప్రస్తావించారు.
News December 11, 2025
BREAKING: భువనగిరి: మరో ఊరిలో ఫలితాలు టై.. గెలుపెవరిదంటే?

యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం పారుపల్లి గ్రామంలో BRS, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థి పంగ కవిత నవీన్కు 80 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి డి.పావని రమేశ్కు సైతం 80 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా తీయగా BRS అభ్యర్థి పంగ కవిత నవీన్ గెలుపొందారు. BRS నేతలు హర్షం వ్యక్తం చేశారు.
News December 11, 2025
APPLY NOW: CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(<


