News March 25, 2025

చాట్రాయి: పులి సంచారిస్తోదంటూ జోరుగా ప్రచారం

image

చాట్రాయి మండలంలో సోమవారం సాయంత్రం పులుల సంచారం జరిగిందంటూ రైతులు చెబుతున్నారు. మండల పరిధిలోని చిన్నంపేట నుండి పర్వతాపురం వెళ్లే దారిలో ఉన్న మొక్కజొన్న చేలలోకి పులులు వచ్చాయంటూ కొందరు రైతులు సమాచారం అందిస్తున్నారు. పులి సంచారానికి సంబంధించి పాద ముద్రలు కూడా ఫోటోల ద్వారా సేకరించామన్నారు. ఇదే విషయమై ఫారెస్ట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు బృందాలుగా వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 19, 2025

రైతులకు గుడ్‌న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

image

AP: ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత సాయం రైతుల ఖాతాల్లో జమ కానుంది. 46,85,838 మంది ఖాతాల్లో రూ.7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్లను సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. కడప(D) పెండ్లిమర్రిలో మ.2గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు.

News November 19, 2025

2030 నాటికి కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు

image

మన దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ద్వారా వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుంది’ అని NLB సర్వీసెస్ రిపోర్టు వెల్లడించింది. దేశంలో 1800కు పైగా GCCల్లో ఏఐ నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది 41 GCCలు ఏర్పాటయ్యాయి.

News November 19, 2025

RGM: ‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి: సీపీ

image

‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజల సహకారం అత్యంత అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, అమ్మకం వంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీపీ పిలుపునిచ్చారు.