News June 2, 2024

చాణక్య ఎక్స్.. ఉమ్మడి తూ.గో.లో కూటమివైపే ప్రజలు!

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో 10 టీడీపీ, వైసీపీ ఒక చోట విజయం సాధిస్తుందని చాణక్య ఎక్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. కాగా.. తుని, అనపర్తి, రాజానగరంలో YCPకి, కాకినాడ రూరల్, పి.గన్నవరంలో జనసేనకు, రామచంద్రపురంలో TDPకి ఎడ్జ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఇక కాకినాడ సిటిలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుందని చెప్పింది.

Similar News

News January 3, 2026

ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీ వై.మేఘా స్వరూప్

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముస్సోరీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5 నుంచి 30 వరకు ఆమె లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో ఉండనున్నారు. కలెక్టర్ గైర్హాజరీలో జేసీ వై.మేఘా స్వరూప్ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

News January 3, 2026

ఏపీపీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్టులను ఈ నెల 5, 7, 10 తేదీల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో టి.సీతారామమూర్తి తెలిపారు. శనివారం రాజమండ్రిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐవోఎన్ డిజిటల్ జోన్, రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

News January 3, 2026

ధవళేశ్వరం: ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు.. గంజాయి నిందితుడికి జైలు

image

ధవళేశ్వరం ఎర్రకొండకు చెందిన గంజాయి నిందితుడు బహదూర్ రామ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. ఇతనిపై స్థానికంగానే కాకుండా హైదరాబాద్ చందానగర్‌లోనూ కేసులు ఉన్నాయని సీఐ టి.గణేశ్ శనివారం వెల్లడించారు. నిందితుడిలో మార్పు రాకపోవడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పీటీ యాక్ట్ నమోదు చేశారు. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.