News September 16, 2024
చాపాడు: ఢివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం

మైదుకూరు – పొద్దుటూరు ప్రధాన రహదారిలో డివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. చాపాడు మండలం విశ్వనాథపురం వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు. పొద్దుటూరు నుంచి మైదుకూరుకి వస్తున్న రహదారిపై వేసిన స్పీడ్ బ్రేకర్ గుర్తించలేక స్కూటీ బోల్తా పడి మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
కడప: వేలంలోకి శ్రీచరణి

మన కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి వుమెన్స్ వరల్డ్కప్లో సత్తాచాటిన విషయం తెలిసిందే. కప్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించింది. అయినప్పటికీ WPLలో ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో త్వరలో జరగనున్న WPL-2026 వేలంలోకి శ్రీచరణి రానుంది. గత సీజన్లో ఆమెకు ఢిల్లీ జట్టు రూ.55 లక్షలు చెల్లించగా.. వేలంలో రూ.కోట్లలో ధర దక్కే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.
News November 7, 2025
సెలవులు రద్దు: కడప DEO

సెలవులపై కడప DEO షంషుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఈ మూడు నెలల్లోని ఆయా శనివారాల్లో స్కూళ్లు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో గత నెలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈక్రమంలో ఈ మూడు సెలవులను వర్కింగ్ డేస్గా ప్రకటించారు.
News November 6, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కడప జిల్లా కొండాపురం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన బోరు నారాయణరెడ్డి గ్రామం వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.


