News March 22, 2025

చారకొండ: మాజీ ఆర్మీ జవాన్ విగ్రహం ధ్వంసం

image

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని బోడబండ తండాకు చెందిన మాజీ ఆర్మీ జవాన్ మహిపాల్ నాయక్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాణవత్ శంకర్ నాయక్ డిమండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గు చేటని అన్నారు. దుండగులు విగ్రహం ముక్కు ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలన్నారు.

Similar News

News October 25, 2025

‘మూడు రోజుల మురిపెం’.. చేయరుగా!

image

కర్నూలులో <<18088805>>బస్సు<<>> ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి పలు చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తిరుపతితో పాటు HYDలో సరైన పత్రాలు లేని బస్సులను గుర్తించి నిలిపివేశారు. అయితే ప్రమాద ఘటన జరిగిందని తూతూ మంత్రపు తనిఖీలు కాకుండా నిత్యం ఇలాగే కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. క్రమంతప్పకుండా తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

News October 25, 2025

BSFలో 391 పోస్టులు

image

<>BSF<<>> స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్ అర్హతతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పతకాలు సాధించినవారు నవంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 23ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి సడలింపు ఉంది. PST,సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/

News October 25, 2025

అమరవీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ పాల్గొనండి: వరంగల్ సీపీ

image

శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్‌ అమరవీరులను స్మరిస్తూ ఈనెల 27న సీపీ కార్యాలయం నుంచి సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. యువతీ, యువకులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించాలని ఆయన కోరారు.