News June 4, 2024

చారిత్రక విజయం దిశగా శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చారిత్రక విజయాన్ని అందుకునే దిశగా టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ కదులుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో శ్రీభరత్ 6,76,463 ఓట్లు సాధించారు. దీంతో ఆయన ఆధిక్యత 3,74,090 ఓట్లకు చేరింది. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికీ కేవలం 3,02,373 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 23 వేల ఓట్లు వచ్చాయి.

Similar News

News December 15, 2025

విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

image

విశాఖలో డిసెంబర్ 21న పల్స్ పోలియో నిర్వహించనున్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఇప్పటికే సూచించారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ విషయన్ని గమనించాలని అధికారులు కోరారు.

News December 15, 2025

విశాఖ: పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు స్ఫూర్తి

image

పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు

News December 15, 2025

గాజువాకలో యువతి ఆత్మహత్య

image

గాజువాకలోని జింక్ గేటు ఎదురుగా గల 59వ వార్డ్‌లోని హిమచల్ నగర్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న గిడుతూరు సాయి కుమారి (23) తన ఇంట్లో ఆదివారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు గమనించి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గాజువాక పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి మృతికి గల కారణాలు తెలియల్సి ఉంది.