News April 10, 2024

చార్మినార్‌ వద్ద ఇదీ పరిస్థితి!

image

రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్‌బజార్‌‌కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో‌ పాషింగ్‌ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్‌ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటో‌లను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. PIC CRD: Anjum Alam

Similar News

News March 15, 2025

UPDATE: మనవడి పుట్టినరోజున తాత సూసైడ్ 

image

మియాపూర్ PS పరిధిలో వ్యక్తి <<15762457>>ఆత్మహత్యకు<<>> పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాఘవేందర్ రావు దీప్తిశ్రీనగర్‌లో నివాసముంటున్నారు. శుక్రవారం రాఘవేందర్ రావు మనవడు పుట్టినరోజు కావడంతో వేడుకలు నిర్వహించుకోవాలని కుటుంబ సభ్యులు షాపింగ్‌కు వెళ్లగా అతను ఇంట్లోనే ఉన్నాడు. షాపింగ్ నుంచి కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూడగా ఉరేసుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 15, 2025

శంషాబాద్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన RGIA పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. MBNRకు చెందిన బాలిక అదే ప్రాంతానికి చెందిన యువతితో కలిసి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. వికారాబాద్‌కు చెందిన జోసఫ్ రాళ్లగూడలో నివాసముంటూ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

News March 15, 2025

HYD: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

షాబాద్‌లోని శ్రీదుర్గా వైన్స్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ సీతారాంపూర్‌లో ఉంటున్నాడు. వైన్స్ ప్రహరీ దూకి చోరీకి యత్నించాడు. శబ్దం రావడంతో అక్కడే నిద్రిస్తున్న బిక్షపతి బయటకు వచ్చాడు. దొరికిపోతానని భయపడి రాడ్డుతో భిక్షపతి తలపై మోదగా అతను మృతి చెందాడు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు నరేందర్‌ను రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!