News October 13, 2024

చింతకొమ్మదిన్నె: బస్సులో నుంచి కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

image

ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌లో నిలబడి ప్రయానిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కడప నుంచి పులివెందులకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మునీంద్రా అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం KSRM ఇంజనీరింగ్ కళాశాల వద్ద బస్సులో నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయం కాగా స్థానికులు అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కి తరలించారు.

Similar News

News December 4, 2025

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢమాల్.!

image

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. జిల్లాలో 12 SROలు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26లో రూ.411.74 కోట్లు టార్గెట్ కాగా.. నవంబరు నాటికి రూ.181.73 కోట్లు మాత్రమే వచ్చింది. బద్వేల్-9.48, జమ్మలమడుగు-10.37, కమలాపురం-8.60, ప్రొద్దుటూరు-40.47, మైదుకూరు-7.10, ముద్దనూరు-3.44, పులివెందుల-11.96, సిద్దవటం-2.45, వేంపల్లె-6.14, దువ్వూరు-2.55, కడప-79.13 కోట్లు వచ్చింది.

News December 4, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12765.00
☛ బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11744.00
☛ వెండి 10గ్రాములు రేట్: రూ.1760.00

News December 4, 2025

కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

image

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.