News October 13, 2024

చింతకొమ్మదిన్నె: బస్సులో నుంచి కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

image

ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌లో నిలబడి ప్రయానిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కడప నుంచి పులివెందులకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మునీంద్రా అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం KSRM ఇంజనీరింగ్ కళాశాల వద్ద బస్సులో నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయం కాగా స్థానికులు అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కి తరలించారు.

Similar News

News December 22, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.13540
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12457
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2080.

News December 22, 2025

పులివెందులకు రానున్న వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 23వ తేదీ నుంచి 25వ వరకు పులివెందులలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 23వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 24వ తేదీ ఇడుపులపాయకు చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు..

News December 22, 2025

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా జబిబుల్లా

image

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరు మైనార్టీ నేత జబిబుల్లాను పార్టీ అధిష్టానం నియమించింది. ప్రొద్దుటూరుకు చెందిన జబిబుల్లా టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైఎస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల స్థానిక టీడీపీ శ్రేణులు, మైనార్టీ నేతలు అభినందనలు తెలిపారు. తన నియామకానికి మద్దతునిచ్చిన, సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి జబిబుల్లా కృతజ్ఞతలు తెలిపారు.