News February 21, 2025
చింతపల్లి: పెళ్లింట తీవ్ర విషాదం

మనవరాలి పెళ్లికి పందిరి వేసేందుకు చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా చెట్టు పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి చెందిన ఘటన చింతపల్లి మం.లో జరిగింది. ధైర్యపురితండాకు చెందిన బాలయ్య(65) మనవరాలి వివాహం శుక్రవారం జరగనుండగా.. పందిరి వేసేందుకు గురువారం తమ పొలానికి సమీపంలో చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 28, 2025
ASF: పారామెడికల్ దరఖాస్తు గడువు పొడిగింపు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025-26 విద్యా సం. గాను DMLT (30), DECG (30) కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును DEC1 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు www.tgpmb.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు కళాశాల వెబ్సైట్ gmckumurambheem asifabad.orgను సంప్రదించాలని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.
News November 28, 2025
నిర్మల్: 2019లో 88 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..!

2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో 88 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ ఏడు 4 GPలు పెరిగాయి. ప్రస్తుతం 400 గ్రామ పంచాయతీలు ఉండగా.. 3,396 వార్డులున్నాయి. అయితే అప్పటి ప్రభుత్వం పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించినా.. నేటికి ఆ సొమ్ము GP ఖాతాల్లో జమ కాలేదు. అటు ఏకగ్రీవం చేస్తే కేంద్రం నుంచి రూ.10లక్షలు ఇస్తామని బండి ప్రకటించారు.
News November 28, 2025
ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.


