News February 21, 2025

చింతపల్లి: పెళ్లింట తీవ్ర విషాదం

image

మనవరాలి పెళ్లికి పందిరి వేసేందుకు చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా చెట్టు పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి చెందిన ఘటన చింతపల్లి మం.లో జరిగింది. ధైర్యపురితండాకు చెందిన బాలయ్య(65) మనవరాలి వివాహం శుక్రవారం జరగనుండగా.. పందిరి వేసేందుకు గురువారం తమ పొలానికి సమీపంలో చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 14, 2025

సిరిసిల్ల: గైనకాలజిస్ట్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలి: కలెక్టర్

image

సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టును వెంటనే భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, డీఎంహెచ్ఓ రజిత పాల్గొన్నారు.

News November 14, 2025

వనపర్తి: రణభేరి సభ గోడపత్రిక ఆవిష్కరణ

image

పాలమూరులో ఈనెల 23న జరగనున్న “బీసీల రణభేరి” బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ పొలిటికల్ జెఎసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బీసీ నాయకులతో కలిసి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: పడిపోయిన BJP ఓట్ల శాతం!

image

గత ఎన్నికతో పోల్చితే BJP ఓట్ల శాతం భారీగా తగ్గింది. 2023 అసెంబ్లీ ఎన్నికలో BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 14.11 శాతం అంటే 25,866 ఓట్లు వచ్చాయి. ఈ ఉపఎన్నికలోనూ BJP తరఫున లంకల దీపక్ రెడ్డే పోటీ చేయగా కేవలం 8.76 శాతం అంటే 17,061 ఓట్లు మాత్రమే పోలై డిపాజిట్ గల్లంతైంది. అంటే గత ఎన్నికతో పోల్చితే 8,805 ఓట్లు తగ్గాయి. కాగా రెండు సార్లు BJP మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం.