News February 15, 2025

చింతపల్లి: వ్యక్తి ఆకస్మిక మృతి

image

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కిటుములలో శుక్రవారం రాత్రి మర్రి కేశవరం (30) అనే వ్యక్తి ఆకస్మికంగా మరణించాడు. శుక్రవారం బ్యాంకు పనిమీద చింతపల్లి వెళ్లి వచ్చాడు. రాత్రి టాయిలెట్‌కు వెళ్లి తిరిగి పడుకోగా ఉదయం మృతి చెంది ఉన్నాడని బంధువులు తెలిపారు. ఐదేళ్ల క్రితం ఊపిరితిత్తుల ఆపరేషన్ జరిగిందని, ఇదే సమస్యతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తమ్ముడిని చూసేందుకు నేడు వెళ్తాడని ఈ లోగా ఇలా జరిగిందని వాపోయారు.

Similar News

News February 24, 2026

HMDA పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 4 గ్రామాలు

image

విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను HMDA పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్‌పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను HMDA పరిధిలో చేర్చారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC ఆధ్వర్యంలో CRMP phase 2 చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

News February 24, 2026

HMDA పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 4 గ్రామాలు

image

విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను HMDA పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్‌పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను HMDA పరిధిలో చేర్చారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC ఆధ్వర్యంలో CRMP phase 2 చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

News February 24, 2026

కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్!

image

ఝార్ఖండ్‌లోని రాంచీలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఏడుగురితో ఢిల్లీకి బయల్దేరిన కాసేపటికే ఛత్రా జిల్లాలోని కర్మటండ్ గ్రామంలో క్రాష్ అయింది. ఒకరు చనిపోయారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.