News February 15, 2025

చింతపల్లి: వ్యక్తి ఆకస్మిక మృతి

image

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కిటుములలో శుక్రవారం రాత్రి మర్రి కేశవరం (30) అనే వ్యక్తి ఆకస్మికంగా మరణించాడు. శుక్రవారం బ్యాంకు పనిమీద చింతపల్లి వెళ్లి వచ్చాడు. రాత్రి టాయిలెట్‌కు వెళ్లి తిరిగి పడుకోగా ఉదయం మృతి చెంది ఉన్నాడని బంధువులు తెలిపారు. ఐదేళ్ల క్రితం ఊపిరితిత్తుల ఆపరేషన్ జరిగిందని, ఇదే సమస్యతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తమ్ముడిని చూసేందుకు నేడు వెళ్తాడని ఈ లోగా ఇలా జరిగిందని వాపోయారు.

Similar News

News November 24, 2025

నిరంజన్ నీ తాటతీస్తా.. ఒళ్లు జాగ్రత్త: కవిత

image

TG: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి చీఫ్ కవిత ఫైరయ్యారు. ఆయన అవినీతి వల్లే వనపర్తిలో BRSకు కోలుకోలేని దెబ్బపడిందని దుయ్యబట్టారు. 3, 4 ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని విమర్శించారు. MRO ఆఫీసును తగలబెడితే ఎదురుతిరిగిన 32 మందిని జైలుకు పంపారన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ‘నాగురించి ఇంకోసారి మాట్లాడితే నీ తాటతీస్తా. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో’ అని హెచ్చరించారు.

News November 24, 2025

తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

image

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.

News November 24, 2025

జనగామ: రేపు కలెక్టరేట్‌లో దిశా కమిటీ సమావేశం

image

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని వసంత తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, దిశా కమిటీ మెంబర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.