News October 21, 2024

చింతమనేనికి బెదిరింపు.. బోరుగడ్డపై కేసు

image

వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఏలూరులోనూ కేసు నమోదైంది. దెందలూరు MLA చింతమనేని ప్రభాకర్‌కు 2023లో బోరుగడ్డ ఫోన్ చేశారు. ‘మా పార్టీ తలచుకుంటే నీ అంతు చూస్తుంది. మీ సామాజికవర్గాన్ని ఖతం చేస్తాం’ అని బెదిరించారు. ఈక్రమంలో చింతమనేని ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో నిన్న రాత్రి కేసు నమోదు చేశారు.

Similar News

News December 17, 2025

ప.గో: మరణంలోనూ వీడని బంధం

image

జీవితాంతం కలిసి నడిచిన ఆ దంపతులను మరణం కూడా విడదీయలేకపోయింది. తాడేపల్లిగూడెం (M) ఆరుగొలనుకు చెందిన మలకా అబద్ధం(75) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భర్త వియోగాన్ని తట్టుకోలేక బుధవారం సాయంత్రం భార్య లక్ష్మి(65) కూడా తుదిశ్వాస విడిచింది. దంపతులు ఇద్దరూ గంటల వ్యవధిలో మరణించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

News December 17, 2025

రైతు బజార్‌లో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్: జేసీ

image

భీమవరం రైతు బజార్‌లో ధరలు, సౌకర్యాలపై ప్రజాభిప్రాయ సేకరణ సంతృప్తికరంగా ఉందని JC రాహుల్ పేర్కొన్నారు. బుధవారం రైతు బజార్‌లోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి ప్రజల అభిప్రాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వినియోగదారుల సూచనల మేరకు త్వరలోనే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రతి స్టాల్‌కు నంబర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు బోర్డులపై ప్రదర్శించాలని ఆయన కోరారు.

News December 17, 2025

సమస్యల పరిష్కారమే లక్ష్యం: రఘురామ కృష్ణంరాజు

image

ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారానికే ‘ప్రజా దర్బార్‌’ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. బుధవారం పెద అమిరంలోని తన కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడమే ధ్యేయంగా అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, అలసత్వం వహించకూడదని ఆయన సూచించారు.