News January 24, 2025

చింతలపూడి: అదుపు తప్పి కారు బోల్తా

image

చింతలపూడి మండలం తిమ్మిరెడ్డి‌పల్లి నుంచి ప్రగడవరం వైపు వెళుతున్న మారుతి కారు మూలమలుపు వద్ద అదుపు తప్పి పంట పొలాల్లో దూసుకెళ్లి బోల్తా కొట్టింది. కారులో సిద్దాంతి ఇరుక్కుపోవడంతో అటుగా వెళ్తున్న కె.గోకవరానికి చెందిన పీహెచ్‌సీ వైద్యాధికారి కృష్ణ కిషోర్ తన వృత్తి ధర్మంతో గాయాలతో ఉన్న సిద్దాంతికి చికిత్స అందించారు. ప్రమాదంలో కారు నుజ్జయింది.

Similar News

News October 14, 2025

ఆదిలాబాద్‌లో బంగారం రికార్డు ధర.!

image

బంగారం పేదవాడికి అందని ద్రాక్షగా మారనుందా.? అంటే వాటి గణాంకాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా పసిడి రేటు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఈరోజు మంగళవారం బంగారం ధర మార్కెట్‌లో తులానికి రూ.1,31,500 పలికి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. పసిడి రేటును చూసి సాధారణ ప్రజలు బెంబలెత్తిపోతున్నారు.

News October 14, 2025

మంథని: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

image

మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి స్టేజీ సమీపంలో బొక్కల వాగు కట్ట కింద SSB ఇటుకల బట్టి సంపులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిది మంథని మండలం స్వర్ణపెళ్లి గ్రామం. అతడిని ఉప్పు మహేష్‌గా గుర్తించారు. మృతదేహం వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. మృతుడు గత ఐదు సంవత్సరాలుగా ట్రాక్టర్ మెకానిక్‌గా మంథనిలో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.

News October 14, 2025

RGM: 74 షాపులకు 74 మంది దరఖాస్తులు

image

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 24 WINES షాపులకు గాను ఇప్పటివరకు 9 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు గతంలో కంటే రూ.లక్ష ఎక్కువ ఉండడంతో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా జిల్లాలోని 74 మద్యం షాపులకు గాను 74 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 18న దరఖాస్తు గడువు ముగియనుంది. అప్పటివరకు దరఖాస్తులు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు.