News April 12, 2025

చింతలమానేపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

image

చింతలమానేపల్లిలోని కర్జవెల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్‌తో పాటు పలు చోట్లు పోస్టర్లు అంటించారు. ‘ఆదివాసీల మీద మావోయిస్టులు అప్రకటిత యుద్ధం..!, కర్రె గుట్టలో మందు పాత్రలు.. మావోయిస్టులారా తీరవా మీ రక్త దాహాలు, అడవుల్లో బాంబులు.. ఆదివాసుల గుండెల్లో గుబులు’ అంటూ పోస్టర్లలో రాసి ఉంది.

Similar News

News February 11, 2026

అసెంబ్లీలో విశాఖ, అనకాపల్లి సమస్యలపై గళం వినిపిస్తారా?

image

నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ, అనకాపల్లి MLAలు పాల్గొననున్నారు. జిల్లాల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలు, మెట్రో‌, RINL, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు, పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు, జాతీయ-రాష్ట్ర రహదారుల కనెక్టివిటీ, రవాణా సౌకర్యాల లోపాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. బడ్జెట్‌లో ఈ సమస్యలను తీర్చేందుకు నిధులు కేటాయించేలా మన MLAలు గళం విప్పాలని ప్రజలు కోరుతున్నారు.

News February 11, 2026

నెల్లూరు: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

image

నెల్లూరు జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు మీ వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని అధికారులు తెలిపారు.

News February 11, 2026

ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

బెజ్జూర్ మండలం హేటిగూడ గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా అభిరామ్(6) సోమవారం మృతిచెందగా నగోశ్ మొండి (17) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో వ్యక్తి వడాయి మోహన్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై సర్తాజ్ పాషా కేసు నమోదు చేశారు.