News March 12, 2025
చింతలమానేపల్లి: స్థానిక సంస్థల్లో కమలం వికసించాలి: ఎమ్మెల్యే

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. మంగళవారం చింతనమానేపల్లి మండలంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు కమలం వికసించాలని కార్యకర్తలకు సూచించారు. పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 29, 2025
గాజాపై దాడులు.. 60 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
News October 29, 2025
కాకినాడ జిల్లాకు రక్షణ కవచంలా ‘ఆ ముగ్గురు’

మొంథా తుఫాను నుంచి కాకినాడ జిల్లాను రక్షించడంలో కలెక్టర్ షామ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ పోషించారు. తుఫాను ప్రభావం మొదలైనప్పటి నుంచి జిల్లా యంత్రాంగాన్ని వీరు ఉరుకులు పరుగులు పెట్టించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఫలితంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నియంత్రించగలగడంలో ఈ ముగ్గురూ సఫలీకృతలయ్యారు. వీరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
News October 29, 2025
హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందర్భంగా నవంబర్ 9వ తేదీ వరకు మంత్రులంతా హైదరాబాద్లోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు తప్పనిసరిగా ఇంటింటికీ తిరిగి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఓట్లు అడగాలని తెలిపారు. ఈ ప్రచారంలో మంత్రులకు సహాయంగా ఉండేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని కూడా CM సూచించారు.


