News March 12, 2025
చింతలమానేపల్లి: స్థానిక సంస్థల్లో కమలం వికసించాలి: ఎమ్మెల్యే

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. మంగళవారం చింతనమానేపల్లి మండలంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు కమలం వికసించాలని కార్యకర్తలకు సూచించారు. పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..!

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <
News November 25, 2025
ములుగు: మండలాల వారీగా వడ్డీ లేని రుణాల పంపిణీ ఇలా..!

రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ములుగు జిల్లాలో రూ.2.7కోట్లను మహిళా పొదుపు సంఘాలకు ఈరోజు అందజేసింది. ఏటూరునాగారంలో రూ.21.89లక్షలు, గోవిందరావుపేటలో రూ.28.46లక్షలు, కన్నాయిగూడెంలో రూ.3.58లక్షలు, మంగపేటలో రూ.49.74, ములుగులో రూ.59.65లక్షలు, తాడ్వాయిలో రూ.5.19 వెంకటాపూర్లో రూ.21.84లక్షలు, వాజేడులో రూ.2.81లక్షలు, వెంకటాపురంలో రూ.13.84 లక్షల రుణాలు ఇచ్చారు.


