News April 8, 2025

చింతూరు: ఈ నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ

image

ఈ నెల 10న చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పేజ్ 1bలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ఈ కార్యక్రమానికి వచ్చి అభిప్రాయాలు తెలపాలన్నారు. నిర్వాసితులు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు వెళ్లిన తర్వాత జీవనోపాధి, నైపుణ్య శిక్షణకు ఎటువంటి అవకాశాలు కావాలో తెలియజేయాలన్నారు.

Similar News

News December 7, 2025

పులివెందుల: ‘పన్ను కట్టలేని స్థితిలో పార్టీ’

image

దేశ రాజకీయాలను శాసించిన పార్టీ మున్సిపాలిటీకి పన్ను కట్టలేని స్థితిలో ఉంది. పులివెందులలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి 2006 నుంచి ఇప్పటివరకు కట్టాల్సిన రూ.3.50 లక్షల పన్ను బకాయిలు చెల్లించాలని ఇటీవల కాంగ్రెస్ నాయకులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా పన్ను బకాయిలపై కాంగ్రెస్ నాయకులు స్పందించలేదని తెలుస్తోంది. దీనిపై మున్సిపల్ అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

News December 7, 2025

సైనికుల సేవలు అమూల్యం: ఇలక్కియా

image

దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల సేవలు అమూల్యమని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవం ఎన్టీఆర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సైనికులకు ఈ నిధి ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లా ప్రజలు, వ్యాపారవేత్తలు, సంస్థలు విరాళాలు అందించాలని ఆమో పిలుపునిచ్చారు.

News December 7, 2025

వీటిని తింటే కళ్లద్దాల అవసరమే రాదు

image

ప్రస్తుత రోజుల్లో చిన్నారులను సైతం కంటి చూపు సమస్యలు వేధిస్తున్నాయి. పోషకాహార లోపమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజూ క్యారెట్‌, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, చిలకడదుంపలు తినిపిస్తే Vitamin A సమృద్ధిగా లభిస్తుంది. చేపలు, వాల్‌నట్స్‌, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. క్యాప్సికం, బ్రోకలీ వంటి ఆహారాలు కూడా కంటి నరాలకు మేలు చేస్తాయి.