News March 9, 2025

చికిత్స పొందుతూ రాజన్నపేట యువకుడు మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకి చెందిన నమలికొండ నూతన్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. 2 నెలల క్రితం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట చేస్తూ కళ్ళు తిరిగి స్టవ్‌పై పడిపోవడంతో వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా సగభాగం శరీరం అంటుకుందని వైద్యులు తెలిపారు. హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతిచెందాడు.

Similar News

News March 10, 2025

సిద్దిపేటలో విషాదం.. తల్లి తిట్టిందని బాలుడి సూసైడ్

image

క్షణికావేశంలో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్‌ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్‌పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.

News March 10, 2025

శ్రేయస్‌ సైలెంట్ హీరో.. రోహిత్ శర్మ ప్రశంసలు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్‌(243)పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. అతనో సైలెంట్ హీరో అని కొనియాడారు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారని, మిడిలార్డర్‌లో చాలా ముఖ్యమైన ప్లేయర్ అని చెప్పారు. ఈ విజయాన్ని భారత అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు హిట్ మ్యాన్ పేర్కొన్నారు. కాగా ఫైనల్లో అయ్యర్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేశారు.

News March 10, 2025

నవాబుపేట : బాలుడిపై కత్తితో దాడి.. అనంతరం పరారీ

image

నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విజయ్ కుమార్‌పై అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు 108 సిబ్బంది ద్వారా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.

error: Content is protected !!