News March 6, 2025

చికిత్స పొందుతూ రెండో విద్యార్థి కూడా మృతి

image

పుత్తూరు మండలం నేషనూరు గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి రవితేజ(17) మృతి చెందగా మరో విద్యార్థి మునికుమార్(18) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం చికిత్స పొందుతూ ముని కుమార్ కూడా మృతి చెందాడు. విద్యార్థులు కాలేజీకి బైకు మీద వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. చనిపోయిన ఇద్దరూ అన్న దమ్ములు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Similar News

News October 16, 2025

అందరి సహకారంతో స్నాతకోత్సవం విజయవంతం: పీయూ వీసీ

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన స్నాతకోత్సవం కనుల పండువగా జరిగిందని వైస్ ఛాన్స్‌లర్ (వీసీ) అన్నారు. గవర్నర్ పర్యటనను దగ్గర ఉండి పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసిన జిల్లా ఎస్పీ డి. జానకి, నెల ముందు నుంచి స్నాతకోత్సవ ఏర్పాట్లపై కృషి చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు వీసీ కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొ.రమేశ్ బాబు, కంట్రోలర్ డా.ప్రవీణ ఉన్నారు.

News October 16, 2025

స్వచ్ఛభారత్ మిషన్ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టవలసిన టాయిలెట్స్ నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. అధికారుల సమీక్షలో గురువారం కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 52 ప్రభుత్వ వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.5.73 కోట్లు మంజూరు చేశారన్నారు. నిర్దేశించిన సమయంలోగా అధికారులు పనులు పూర్తిచేయాలన్నారు.

News October 16, 2025

17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఈ సమావేశంలో సమీక్షిస్తామని చెప్పారు. సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.