News February 26, 2025
చికెన్ లెగ్పీస్ తిన్న బాపట్ల జిల్లా కలెక్టర్

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా చికెన్ తినేందుకు ప్రజలు ఇప్పటికీ జంకుతున్నారు. చికెన్పై అపోహలు వద్దని చికెన్ తినొచ్చని అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో ఒకింత భయం నెలకొంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకేసి ప్రజల భయం పోగొట్టేలా చికెన్తో తయారు చేసిన ఆహారం తింటూ కనిపించారు. దీంతో ఇకనైనా ప్రజలు భయాన్ని వీడి చికెన్ తినాలని ఆకాంక్షించారు.
Similar News
News December 20, 2025
జర్నలిస్టుల సెమినార్కు వస్తా: మంత్రి లోకేశ్

APUWJ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించే సెమినార్కు హాజరవుతానని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని జర్నలిస్టుల బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
News December 20, 2025
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో ముస్తాబు: సీఎం చంద్రబాబు

ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో ముస్తాబు కార్యక్రమం అమలవుతుందని, అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం నుంచి ఇది ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం కశింకోట మండలం తాళ్లపాలెం బాలికల గురుకులంలో విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగపర్చుకొని బాలికలు ఒక జ్ఞాన సంపదగా మారాలని ఆయన ఆకాంక్షించారు.
News December 20, 2025
తాళ్లపాలెం: పిల్లల ద్వారా వ్యక్తిగత శుభ్రత తెలసుకున్న సీఎం

అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం బాలికల గురుకులంలో సీఎం చంద్రబాబుకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. గురుకులంలో తరగతి గదులు, డిస్పెన్సరీ, ఇతర ప్రాంగణాలను సీఎం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గురుకులంలో చదువుతున్న బాలికలే కొన్ని అంశాలను చంద్రబాబుకు వివరించారు. వ్యక్తిగత శుభ్రత లేకపోతే లీడర్లుగా తామే అనుమతించమని చెప్పారు. ఈ వ్యక్తిగత శుభ్రత ఎలా చేపడతారో నేరుగా సీఎం పిల్లల ద్వారా తెలుసుకున్నారు.


