News March 18, 2025
చిగురాకు తొడిగిన భారతావని ‘చివరి’ అంచు!

ఆకాశం అందమైన కాన్వాస్ అయితే దానిపై ప్రతి రోజు రూపుదిద్దుకున్న చిత్రాలెన్నో. కళాత్మకంగా కూడిన మనసు ఉండాలే కానీ ఆకాశంలో ఉండే మేఘాలు, ఏపుగా పెరిగిన చెట్లు ఎన్నో రకాల అద్భుతమైన రూపంలో కనిపిస్తాయి. వరంగల్ నగరంలోని నర్సంపేట రోడ్డులో పచ్చని చెట్ల కొమ్మలు భారతదేశ పటం చివరి భాగం రూపంలో పచ్చదనంతో అల్లుకొని ఉన్న చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.
Similar News
News December 12, 2025
స్థానిక ఎన్నికలు.. ర్యాలీలు, సభలు నిషేధం: సీపీ

స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తక్షణమే విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, సభలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
News December 12, 2025
కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. మిరపకు నల్ల తామర ముప్పు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీని వల్ల మిరప పంటకు నల్ల తామర ముప్పు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పురుగులు మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీంతో ఆకులు, కాయలు రాలిపోతాయి. మొక్క పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుల వృద్ధి ఎక్కువ. ఆకు ముడత వ్యాప్తికి నల్ల తామర పురుగులు వాహకాలుగా పనిచేస్తాయి.
News December 12, 2025
ఫోర్ట్ వరంగల్కు చేరుకున్న ఒయాసిస్ జనని యాత్ర!

దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ఓయాసిస్ జనని యాత్ర వరంగల్కు చేరుకుంది. టైర్ I, ఈ, III ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం, ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఒయాసిస్ ప్రతినిధులు తెలిపారు. ఫోర్ట్ వరంగల్ తర్వాత ఈ జనని యాత్ర, రాష్ట్రంలో భూపాలపల్లి, జమ్మికుంట, మహబూబాబాద్ ప్రాంతాల్లో యాత్ర కొనసాగనుంది.


