News October 28, 2024

చిట్టి నాయుడి చిల్లర డ్రామాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి: MLC

image

ఖమ్మం: చిట్టి నాయుడు చిల్లర డ్రామాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఆశపడి ప్రజలు మోసపోయారని సోమవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన చెప్పారు. హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడం చేతకాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని విమర్శించారు.

Similar News

News December 22, 2025

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతూ కొత్తగా నియమితులైన ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ప్రభుత్వ బీసీ స్డడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకోని గ్రూప్-3, గ్రూప్-4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కలెక్టర్‌ను సోమవారం కలిశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు చేసేందుకు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.

News December 22, 2025

48 గంటల్లోనే జీవో.. మాట నిలబెట్టుకున్న పొంగులేటి..!

image

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన TWJF మహాసభలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ విధివిధానాలపై 10 రోజుల్లో జీవో ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, ఆ గడువు అవసరం లేకుండానే కేవలం 48 గంటల్లోనే జీవో విడుదల చేయించి మంత్రి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.

News December 22, 2025

ఖమ్మం జిల్లాలో Dy.Cm పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం పర్యటన షెడ్యూల్ వివరాలను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:35కు తల్లాడ (మం) పినపాకలో 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు సత్తుపల్లిలో సింగరేణి జీఎం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:30కు జీవీఆర్ ఓపెన్ కాస్ట్ మెయిన్-2ను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు.