News March 7, 2025
చిట్యాల: ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రబెల్లి విజయ-దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఎర్రబెల్లి పల్లవి(19) ఉన్నారు. పల్లవి, ఆమె తల్లి విజయ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చు అయ్యాయని.. సరిపడా డబ్బులు లేకపోవడంతో మనస్థాపానికి గురయ్యేదని వివరించారు.
Similar News
News March 19, 2025
ఫ్యామిలీ రూల్ పాలసీ మారదు: BCCI సెక్రటరీ

విదేశీ పర్యటనల ఫ్యామిలీ రూల్స్పై <<15777927>>కోహ్లీ<<>> వ్యాఖ్యలకు BCCI సెక్రటరీ సైకియా కౌంటర్ ఇచ్చారు. ఈ రూల్స్ను సమీప భవిష్యత్తులో మార్చబోమన్నారు. ‘దీనిపై కొందరికి ఆగ్రహం, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాత్రికి రాత్రే ఈ విధానం తేలేదు. పాత నిబంధనలకే సవరణ చేశాం. ప్రాక్టీస్ సెషన్లలో ఆటగాళ్ల హాజరు, మ్యాచ్ షెడ్యూల్లు, పర్యటనలు తదితర నిబంధనలున్నాయి. ఇవి జట్టు సమన్వయం, ఐక్యత కోసం తీసుకున్న నిర్ణయాలు’ అని తెలిపారు.
News March 19, 2025
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబించింది: మంత్రి సురేఖ

రాష్ట్ర బడ్జెట్ మీద మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రాష్ట్ర రెండో బడ్జెట్ ప్రతిబింబించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి తగిన మేరకు కేటాయింపులు చేయడం హర్షణీయం అని మంత్రి అన్నారు.
News March 19, 2025
రీ సర్వేలో పారదర్శకతకు పెద్ద పీట: కలెక్టర్

జిల్లాలో సమగ్ర భూ సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, అత్యంత జవాబుదారీతనంతో భూ లెక్కలను పక్కాగా తేల్చేందుకే రీసర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. బుధవారం ఆయన చందర్లపాడు మండలం, ఉస్తేపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న గ్రామ సరిహద్దుల నిర్ధారణ, రెండో దశ రీసర్వే డేటా సేకరణ కార్యకలాపాలను తనిఖీ చేశారు. ఆయన పలు శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.