News March 22, 2025

చిట్యాల మండల వాసులైన ఇద్దరికి ప్రభుత్వ కొలువులు

image

తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన కొలువుల ఫలితాల్లో చిట్యాల మండల వాసులైన ఇద్దరిని ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. జూకల్‌కు చెందిన దొంతు మాధవరెడ్డి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా, ముచినిపర్తి గ్రామానికి చెందిన గుండెపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిఆర్ శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా సెలెక్ట్ కాగా.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను తీసుకున్నట్లు వారు చెప్పారు.

Similar News

News November 27, 2025

సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

image

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.

News November 27, 2025

పీ-4 కార్యక్రమానికి పెద్ద మనసుతో ముందుకు రావాలి: మంత్రి

image

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో పీ-4 కార్యక్రమం అమలుపై గురువారం సమీక్షించారు. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు అధికారులు పెద్ద మనసుతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముందుకు వస్తే తొలి నా వంతు సాయంగా రూ.10 లక్షలు అందిస్తానన్నారు.దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే రికవరీ చేస్తున్న పోలీసులను అభినందించారు.

News November 27, 2025

భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

image

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వరి కోతల సీజన్ నడుస్తోంది. కోత పూర్తైన వరి పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించింది. ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్ కప్పాలని, ఒకవేళ వానకు ధాన్యం తడిస్తే రంగుమారకుండా, మొలకెత్తకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరింది.