News March 15, 2025
చిట్యాల: యువకుడికి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు

తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యం నిర్దేశించుకున్న అజయ్ ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. చిట్యాల మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన నల్ల అజయ్ 2018లో కానిస్టేబుల్, 2024లో గ్రూప్-4, 2025లో ఏకంగా గ్రూప్-2లో స్టేట్ 43, గ్రూప్-3లో 26 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం అజయ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాడు.
Similar News
News March 15, 2025
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో శనివారం రోజు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూర్చొని అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తున్న సమయంలో ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని ఉండడం పట్ల సీపీఐ నాయకులు, కొత్తగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 15, 2025
గ్రహాంతరవాసులపై షాకింగ్ విషయాలు

గ్రహాంతరవాసులున్నారా అన్న ప్రశ్నకు అమెరికా మాజీ నిఘా, సైనికాధికారులు ‘ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్’ అనే డాక్యుమెంటరీలో సంచలన విషయాలు వెల్లడించారు. ‘1940ల నాటి నుంచీ గ్రహాంతరవాసులు గుర్తుతెలియని ఎగిరే వాహనాల్లో(UAP) భూమిపైకి వస్తున్నారు. మన సాంకేతిక పురోగతిని పరిశీలిస్తున్నారు. వారు వచ్చే వాహనాలు గంటకు 50వేల కి.మీ పైగా వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటిని మానవమాత్రులు తయారుచేయలేరు’ అని స్పష్టం చేశారు.
News March 15, 2025
విశాఖలో 17 మంది పోలీసులకు బదిలీ

విశాఖ కమీషనరేట్ పరిధిలో 17 మంది సివిల్ పోలీస్ సిబ్బందిని శనివారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీలు చేశారు. వీరిలో ఒక ఏఎస్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ జరిగిన పోలీస్ స్టేషన్లలో తక్షణమే విధులలో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.