News April 22, 2025

చిట్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

image

చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్‌ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 22, 2025

ఉమ్మడి నల్గొండ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

image

☞ ఫస్ట్ ఇయర్‌లో (స్టేట్)
నల్గొండ – 56.74 శాతంతో 21వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 58.54 శాతంతో 17వ ర్యాంక్
సూర్యాపేట – 54.78 శాతంతో 24వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్‌..
నల్గొండ – 68.97 శాతంతో 17వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 67.92 శాతంతో 22వ ర్యాంక్
సూర్యాపేట – 66.28 శాతంతో 26వ ర్యాంక్

News April 22, 2025

ఇంటర్ రిజల్ట్స్: నల్గొండ పాస్ పర్సంటేజ్ ఇలా..

image

నల్గొండ జిల్లాలో ఫస్టియర్ పరీక్షను 13,977 మంది రాయగా 7931 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 56.74 శాతంగా ఉంది. సెకండియర్‌లో 12,992 విద్యార్థులకు గాను 8,960 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.97శాతంగా ఉంది.

News April 22, 2025

నాగార్జునసాగర్ జలాశయం నేటి సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయం సమాచారాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 514.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయడ లేదు. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

error: Content is protected !!