News April 12, 2025

చిట్వేలు: ఆ కాలేజీలో ఒక్కరే పాస్

image

చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఒకే విద్యార్థిని ఆనందల మల్లిక ఉత్తీర్ణులయ్యారు. 474 మార్కులకు గానూ 294 మార్కులు సాధించారు. 78 మంది పరీక్షలు రాస్తే 77 మంది ఫెయిలయ్యారు. చిట్వేలులో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారు కానీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ లేకుండానే సంవత్సరం పూర్తి అయిపోయింది. అధికారులు లెక్చరర్లను నియమించాల్సి ఉంది.

Similar News

News November 17, 2025

RGNIYDలో ఉద్యోగాలు

image

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌ (<>RGNIYD<<>>) 6 టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15లోపు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, M.Lib.sc, B.Lib.sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rgniyd.gov.in/

News November 17, 2025

ఇతరులను విమర్శించొద్దు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో..

image

వివిధ సందర్భాల్లో పుట్టపర్తి సత్యసాయి బాబా చెప్పిన సూక్తులు..
★ అడ్డంకులు ఎదురైనప్పుడు, వాటిని పరీక్షలుగా భావించాలి
★ మితంగా తిని, దీర్ఘకాలం జీవించండి. ఎన్నో యుగాలుగా ఋషుల నుంచి మనకు అందిన సలహా ఇది
★ ఇతరులను విమర్శించొద్దు. దానికి బదులు నిన్ను నువ్వే విమర్శించుకో, ప్రశ్నించుకో
★ అందరిలోనూ దైవాన్ని చూడు. నువ్వు ఎవరికి నమస్కరించినా, అది చివరకు ఆ భగవంతుడికే చేరుతుంది.
#సత్యసాయి శత జయంతి

News November 17, 2025

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

image

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.