News October 14, 2024

చిత్తూరుం 15 న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

ఈనెల 15వ తేదీన జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం భారీ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 15, 16 తేదీల్లో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అన్ని పిహెచ్సిలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నెం: 9491077356 కు కాల్ చేయాలన్నారు

Similar News

News December 6, 2025

కామాలూరు-చిత్తూరు RTC బస్సు సర్వీసు ప్రారంభం

image

తవణంపల్లి మండలంలోని కామాలూరు-చిత్తూరు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బస్సు సర్వీసు ప్రారంభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News December 6, 2025

బాబోయ్.. మాకు తిరుపతి SVU వద్దు!

image

తిరుపతి SVU పరిధిలోని MBA, MCA కాలేజీలు వర్సిటీ నిర్ణయాలతో గగ్గోలు పెడుతున్నాయి. అధిక ఫీజులు, పరిపాలన విధానపరమైన నిర్ణయాలు సరిగా లేకపోవడం, పరీక్షా ఫలితాలు ఆలస్యం తదితర కారణాలతో SVU నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. NOC ఇస్తే అనంతపురం జేఎన్టీయూ తదితర వర్సిటీల నుంచి గుర్తింపు పొందాలని చూస్తున్నాయి. మరి SVU అధికారులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా? లేక NOCలు ఇస్తారా? వేచి చూడాలి.

News December 6, 2025

బోయకొండ గంగమ్మ భక్తులకు గమనిక

image

బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వత నిత్యార్చన సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారుల ఆదేశాలతో సంక్రాంతి నుంచి అమ్మవారికి శాశ్వత నిత్యార్చన నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదికి రూ.10,116, 6నెలలకు రూ.7,116, 3నెలలకు రూ.5,116, నెలకు రూ.2,116తో సేవా టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కుంకుమార్చన రూ.101, వడి బాల సేవ రూ.201తో నూతన సేవలు ప్రవేశ పెడతామన్నారు.