News April 11, 2024

చిత్తూరులో అక్కడ బావ, మరదల పోటీ

image

చిత్తూరు జిల్లాలో జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఈసారి బావ, మరదల మధ్య పోటీ జరగనుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి వైసీపీ జీడీనెల్లూరు MLA అభ్యర్థిగా, ఆయన చెల్లెలు కుమారుడు రమేశ్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. బావ, మరదల పోటీలు ఎవరు గెలుస్తారో చూడాలి మరి. ఇదే స్థానంలో టీడీపీ అభ్యర్థిగా వీఎం.థామస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Similar News

News February 9, 2026

కుప్పంలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు

image

కుప్పం నియోజకవర్గంలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు (20 ఏళ్ల లోపు గర్భం దాల్చడం) ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 8.8% టీనేజ్ ప్రెగ్నెన్సీ‌లు ఉండగా అందులో అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కుప్పం తర్వాత నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12 శాతం కంటే ఎక్కువ టీనేజీ ప్రెగ్నెన్సీలు ఉన్నాయి.

News February 9, 2026

కార్వేటినగరంలో కోళ్లు మృతి.. DMHO తనిఖీలు

image

కార్వేటినగరం(M) RKVBపేటలో ఇందిరా కాలనీ వద్ద కోళ్ల ఫారంలో నాలుగు రోజులుగా కోళ్లు మృతి చెందుతున్నాయి. దీనిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం DMHO సుధారాణి కోళ్లఫారం ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

News February 9, 2026

వినతులకు సత్వర పరిష్కారం చూపండి: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్‌కు వచ్చినా ఫిర్యాదు మళ్లీ రాకుండా బాధితుల పరిధిలోనే పరిష్కరించేలా చూడాలని సూచించారు.