News July 19, 2024
చిత్తూరు: ఆధార్ కోసం ప్రత్యేక క్యాంపులు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వ హించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. పెండింగ్ ఆధార్ సర్వీసులను అప్డేట్ చేయనున్నారు. ప్రతి మండలంలో క్యాంపులు నిర్వహించనున్నారు.
Similar News
News December 5, 2025
చిత్తూరు: ‘తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి’

పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు మండలంలోని తుమ్మింద జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం పోటీ తత్వం ఎక్కువగా ఉందని విద్యార్థులు రాణించాలంటే క్రమశిక్షణతో కూడిన పట్టుదల, కృషి అవసరమన్నారు.
News December 5, 2025
స్థానికులపై చిన్నచూపు లేదు: TTD ఈవో

వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తిరుపతి స్థానికులకు అన్యాయం జరిగిందని.. మొదటి మూడు రోజులు దర్శనాలు కల్పించి ఉంటే బాగుండేదని తిరుపతికి చెందిన చంద్రశేఖర్ డయల్ యువర్ TTD ఈవోలో కోరారు. ‘వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు పవిత్రమైనవే. అందరినీ దృష్టిలో పెట్టుకుని, స్థానికులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే చివరి మూడు రోజులు దర్శనాలకు కేటాయించాం. స్థానికులపై చిన్న చూపు లేదు’ అని ఈవో అనిల్ సింఘాల్ సమాధానమిచ్చారు.
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.


