News October 26, 2024

చిత్తూరు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. తేనె బండ ధర్మరాజుల కాలనికి చెందిన మురళి (29) చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. యజమాని వద్ద డబ్బులు తీసుకుని తిరిగి కట్టలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం ఉరివేసుకున్నాడు. మృతదేహాన్ని మార్చురికి తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News December 3, 2025

చిత్తూరు: డిప్యూటీ MPDOలకు కీలక బాధ్యతలు

image

చిత్తూరు జిల్లాలో సచివాలయాలను పర్యవేక్షించేలా డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తున్నారు. మండలంలోని 31 మండలాల్లో 504 గ్రామ సచివాలయాలు, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 27మంది డిప్యూటీ ఎంపీడీవోలు విధుల్లో చేరారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా వీరు పర్యవేక్షణ చేయనున్నారు.

News December 3, 2025

చిత్తూరు: 10Th, ఇంటర్ చదవాలని అనుకుంటున్నారా?

image

చిత్తూరు జిల్లాలోని ఓపెన్ స్కూల్లో 10వ తరగతి, ఇంటర్ చదివేందుకు ఈనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు పొందేవారు ఫీజుతో పాటు తాత్కాల్ రుసుం రూ.600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు జిల్లాలోని కోఆర్డినేటర్ సెంటర్లు, డీఈవో కార్యాలయంలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.

News December 3, 2025

చిత్తూరు జిల్లా చిన్నది అవుతుందనే..!

image

నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది. MLA భానుప్రకాశ్ సైతం ఇదే అంశంపై పోరాడారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లాలో 31మండలాలు ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 4 మండలాలను మదనపల్లె జిల్లాలో కలిపారు. నగరిలోని 3 మండలాలను తిరుపతిలో కలిపిస్తే 24 మండలాలతో చిత్తూరు జిల్లా చిన్నది అవుతుంది. అందుకే నగరి మండలాలను చిత్తూరు జిల్లాలోనే కొనసాగిస్తున్నారని సమాచారం.