News August 6, 2024

చిత్తూరు: ఎన్ఎంఎంఎస్‌కు దరఖాస్తు చేసుకోండి

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఎనిమిదో తరగతి విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో దేవరాజు తెలిపారు. పరీక్ష రాసేందుకు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోగా ఉండాలన్నారు. పరీక్ష డిసెంబరు 8న నిర్వహించనున్నట్లు చెప్పారు.

Similar News

News October 23, 2025

చిత్తూరులో భద్రత కట్టుదిట్టం.!

image

చిత్తూరు మాజీ మేయర్ కటారి <<18085908>>అనురాధ దంపతుల<<>> హత్య కేసు తీర్పు నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. CHUDA చైర్‌పర్సన్ కె.హేమలత, మాజీ MLA సి.కె.బాబు నివాసాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా న్యాయమూర్తి, APP, డిఫాక్టో కంప్లైనెంట్ నివాసాల వద్ద సైతం భద్రత పెంచారు. నేరపూర్వ చరిత్ర ఉన్న వారిపై నిఘా కొనసాగుతోందని DSP సాయినాథ్ తెలిపారు.

News October 23, 2025

రేపే కటారి దంపతుల హత్య కేసు ఫైనల్ జడ్జిమెంట్

image

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ <<18079030>>హత్య కేసు<<>>లో శుక్రవారం తీర్పు వెలువడనుంది. 10 ఏళ్ళ పాటు ఈ కేసుపై విచారణ సాగింది. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అలర్లు జరగకుండా పోలీసులు కోర్టు వద్ద పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంచారు. గుంపులుగా చేరడం, తిరగడంపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. కోర్టు పరిసరాల్లో సిబ్బందికి తప్ప మరెవరికి అనునతి లేదని వారు స్పష్టం చేశారు.

News October 23, 2025

చిత్తూరు: రేపటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

image

చిత్తూరు జిల్లాలోని పాఠశాలలు శుక్రవారం తెరుచుకోనున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు తలెత్తకుండా స్కూళ్లలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల పరిధిలో కాలువలు, కుంటలు ఉంటే అక్కడికి విద్యార్థులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. విద్యార్థులను వేడి నీరు అందించే ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆమె కోరారు.