News October 19, 2024
చిత్తూరు: కడపలో అగ్నివీర్ ర్యాలీ

కడపలోని డీఎస్ఏ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ కార్యాలయం డైరెక్టర్ కల్నల్ పునిత్ కుమార్ తెలిపారు. అడ్మిట్ కార్డులు పొందిన చిత్తూరు జిల్లా అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనాలని సూచించారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు.
Similar News
News December 19, 2025
చిత్తూరు: పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు.!

చిత్తూరు జిల్లాలో ఓ జంటకు పెళ్లై 21 ఏళ్లలో 14 మంది పిల్లలు పుట్టారంటే నమ్మండి. వీరిలో 7 మంది మగ పిల్లలు, 7 మంది ఆడపిల్లలు జన్మించగా.. వారిలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. GDనెల్లూరు(M) ఆవల్ కండ్రిగకు చెందిన దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో సదరు మహిళ గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ బిడ్డగా మగ పిల్లాడికి జన్మనిచ్చింది.
News December 19, 2025
చిత్తూరు: అర్జీల పరిష్కారంలో వెనుకబాటు.!

PGRS వినతుల పరిష్కారంలో చిత్తూరు జిల్లా వెనుకబాటులో ఉంది. కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు నివేదిక వెలువడింది. నిర్దేశించిన గడువులో వాటిని పరిష్కరించకపోవడంతో ఈ విభాగంలో జిల్లా 7.27%తో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. అర్జీల రీ ఓపెన్లో 14.52 శాతంతో మూడో స్థానంలో ఉంది. LPM తిరస్కరణలో 28.85 శాతంతో మూడో స్థానంలో ఉంది.
News December 19, 2025
చిత్తూరు: 1447 మంది గైర్హాజరు.!

చిత్తూరు జిల్లాలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం పాఠశాలల్లో వందరోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు 1447 మంది విద్యార్థులు గైర్హాజరవుతున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1529 మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక తరగతులకు 13,762 మంది మాత్రం హాజరవుతున్నట్టు వెల్లడించారు. అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.


