News April 25, 2024
చిత్తూరు: కర్ణాటక ఓటర్లకు సెలవు

చిత్తూరు జిల్లాలోని వివిధ సంస్థలు, పరిశ్రమలు, దుకాణాల్లో పనిచేసే కర్ణాటకకు చెందిన ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. కర్ణాటకలో ఈ నెల 26, మే 7వ తేదీన రెండు దశలుగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పనిచేస్తున్నవారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ‘ముస్తాబు’

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమం పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. వసతి గృహాలు, ముస్తబు కార్యక్రమ అమలుపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ను మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని ఆయన సూచించారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ పీవో వెంకట రమణ పాల్గొన్నారు.
News December 22, 2025
చిత్తూరు పోలీసులకు 50 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 50 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 5, భూతగాదాలపై 18 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ
సిబ్బందిని ఆదేశించారు.
News December 22, 2025
చిత్తూరు జిల్లాలో 88.36% పల్స్ పోలియో

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.


