News April 25, 2024
చిత్తూరు: కర్ణాటక ఓటర్లకు సెలవు
చిత్తూరు జిల్లాలోని వివిధ సంస్థలు, పరిశ్రమలు, దుకాణాల్లో పనిచేసే కర్ణాటకకు చెందిన ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. కర్ణాటకలో ఈ నెల 26, మే 7వ తేదీన రెండు దశలుగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పనిచేస్తున్నవారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు.
Similar News
News January 16, 2025
నా చుట్టూ తిరిగితే పదవులు రావు: నారా లోకేశ్
నారావారిపల్లెలో బుధవారం ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చుట్టూ తిరిగితే పదవులు రావని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు. నాయకుల పనితీరుపై వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. పొలిట్బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30 శాతం కొత్తవారు రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు.
News January 15, 2025
ఏర్పేడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఏర్పేడు మండలం మేర్లపాక హైవే సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం ఏర్పేడు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిది నెల్లూరు నగరంలోని స్టోన్హౌన్పేటగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 14, 2025
చంద్రగిరి: భయంతో బాలుడు ఆత్మహత్య
చంద్రగిరి పట్టణంలోని బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు తన స్నేహితుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో సమీర్ స్నేహితుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో సమీర్పై అతని మామ కోపంతో గదిలో పెట్టి తలుపు వేశాడు. తిరిగి వచ్చి కొడుతాడన్న భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.