News March 20, 2024

చిత్తూరు: గెలిపిస్తారా.. షాక్ ఇస్తారా?

image

ప్రత్యర్థుల బలహీనతల కంటే సొంత పార్టీలోని అసమ్మతి నేతల తీరుపైనే విజయావకాశాలు ఉంటాయి. నగరిలో రోజాను YCP నేతలే వ్యతిరేకించినా ఆమెకే జగన్ టికెట్ ఇచ్చారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు వద్దని జనసేన, టీడీపీ నేతలు బాహటంగా చెబుతున్నారు. సత్యవేడులో ఆదిమూలాన్ని మార్చాలని, తంబళ్లపల్లెలో శంకర్‌కు టికెట్ ఇవ్వాలని నేతలు చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆయా చోట్ల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

Similar News

News October 27, 2025

చిత్తూరు జిల్లాలో రేపు కూడా స్కూళ్లకు సెలవు

image

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.

News October 27, 2025

చిత్తూరులో పటిష్ఠ బందోబస్తు

image

గత మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సోమవారం నిందితులకు శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో చిత్తూరులో పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చిత్తూరు 1, 2 టౌన్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కోర్టు పరిధిలో లాయర్లు సిబ్బందిని తప్ప మరెవరిని అనుమతించామన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.

News October 26, 2025

చిత్తూరు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

image

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు సెలవు పాటించాలని అందులో ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను నదులు, కాలువలు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.