News June 28, 2024

చిత్తూరు జడ్పీ పూర్వ సీఈవోపై వేటు

image

చిత్తూరు జడ్పీ సీఈవోగా గతంలో పని చేసిన ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. బైరెడ్డిపల్లె ఎంపీడీవోగా ఉన్న ఆయనకు సీఈవోగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన అనేక అక్రమాలు చేశారని టీడీపీ నేతలు నరసింహులు, గీర్వాణి ఆరోపించారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలు నిజమేనని నిర్ధారించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Similar News

News January 10, 2026

బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని ఒకరి స్పాట్ డెడ్

image

బంగారుపాళ్యం మండలం బలిజపల్లి సమీపంలో కంటైనర్ వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. శుక్రవారం రాత్రి బలిజపల్లి సమీపంలో గల ఫ్లైఓవర్ వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని హాస్పిటల్‌కి తరలించారు.

News January 10, 2026

చిత్తూరు జిల్లాలో 638 విద్యుత్ సమస్యలు

image

చిత్తూరు జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 251 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లవి 26, LT లైన్ 339, సర్వీసు లైన్ 22 కలిపి మొత్తం 638 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్‌స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 63 సమస్యలను పరిష్కారించినట్లు చెప్పారు.

News January 9, 2026

చిత్తూరు: ‘అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు’

image

ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలను వసూలు చేస్తే చర్యలు తప్పవని రవాణా ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన కార్యాలయంలో బస్సుల యాజమాన్యంతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ను వాయిదా, రద్దు చేయడం తగదన్నారు. ప్రతి బస్సులో సేఫ్టీ పరికరాలు ఉండాలన్నారు.