News February 25, 2025

చిత్తూరు జాయింట్ కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

image

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్లను నిర్దేశిత ధరలకే విక్రయించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి సూచించారు. కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తే చర్యలు ఉంటాయన్నారు. పలు ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. అలాంటి ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ ఎంత ధరకు ఇస్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News March 24, 2025

పోలీస్ కుటుంబాలు నన్ను తిట్టుకుంటున్నాయి: MLA

image

చిత్తూరు జిల్లాలో పోలీసు కుటుంబాలు తనను తిట్టుకుంటున్నాయని పలమనేరు MLA అమర్‌నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య అనంతరం వైసీపీకి అనుకూలంగా పని చేసిన వారిని మార్చమని అడిగితే.. SP ఇష్టానికి బదిలీలు చేశారని ఆరోపించారు. దీంతో వారి భార్యా పిల్లలు తనను ద్వేషిస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు శాశ్వతం కాదని, అధికారులే శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు.

News March 24, 2025

చిత్తూరు: మహిళా VRO ఆత్మహత్య

image

చిత్తూరులోని సంజయ్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న ముత్తుకూరు VRO తనీషా (31) కుటుంబ కలహాలతో శనివారం విషం ద్రావణం తాగారు. కుటుంబ సభ్యులు గమనించి చీలాపల్లి సీఎంసీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఏడేళ్ల క్రితం రమేశ్‌తో తనీషాకు వివాహమైంది. వారికి పిల్లలు లేరు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. కాగా రమేశ్ ఆర్మీలో పని చేస్తున్నారు.

News March 24, 2025

రూ.1.14 కోట్ల విద్యుత్ బిల్లులు వసూలు

image

విద్యుత్ బిల్లుల చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. రెండు జిల్లాలలో మొత్తం10 వేల 200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా.. కోట్లు వసూలు అయినట్లు ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వెల్లడించారు.

error: Content is protected !!