News January 23, 2026

చిత్తూరు జిల్లాలో భూ సమస్యలే ఎక్కువ..!

image

చిత్తూరు జిల్లాలో ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ గ్రీవెన్స్ డేకు అర్జీలు భారీగా వస్తున్నాయి. డిసెంబర్, జనవరి 19వ తేదీ వరకు ఒక్క రెవెన్యూ శాఖపైనే 1,238 అర్జీలు అందాయి. డిసెంబర్‌లో 742 ఫిర్యాదులకు 638 పరిష్కరించి, 78 రిజెక్ట్ చేశారు. 26 పెండింగ్‌లో ఉన్నాయి. జనవరిలో 496 మంది భూ సమస్యలపై అర్జీలు ఇవ్వగా 290 పరిష్కరించి, 42 రిజెక్ట్ చేయగా.. 164 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది.

Similar News

News February 18, 2026

చిత్తూరు: స్నేక్ రెస్క్యూపై ప్రత్యేక చర్యలు.!

image

పాముల సంరక్షణపై అటవీశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘సర్పమిత్ర’ కార్యక్రమంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి HWC హాట్‌స్పాట్స్‌లో పాములను కాపాడే విధంగా ప్రణాళిక రూపొందించింది. టీమ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్పమిత్ర ట్రైనర్లుగా నియమించనున్నారు. నిపుణులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్నేక్ రెస్క్యూ సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభించి, పాముల పట్టివేత, సురక్షిత హ్యాండ్లింగ్‌పై ప్రొటోకాల్ రూపొందించనున్నారు.

News February 18, 2026

చిత్తూరు DMHOగా డా.నాగశశి భూషణ్ రెడ్డి

image

చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నాగశశి భూషణ్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ముగ్గురు జిల్లా వైద్యాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో DIO అధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగ శశి భూషణ్ రెడ్డిని DMHOగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. త్వరలో ఈయన బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిపారు.

News February 18, 2026

CM రిక్వెస్ట్.. కుప్పంలో 2 ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌

image

CM చంద్రబాబు రిక్వెస్ట్ నేపథ్యంలో కుప్పంలో 2 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 10న CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కుప్పంలో వాస్కోడగామా-వేలంకణి, దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో 2 రైళ్ల స్టాపింగ్‌కు ఆమోదం తెలుపుతూ కేంద్రమంత్రి CM చంద్రబాబుకు లేఖ రాశారు.