News July 31, 2024
చిత్తూరు జిల్లాలో BSNLకు 19వేల మంది షిప్ట్..?

టెలికాం సంస్థల రేట్ల ప్రభావం చిత్తూరు జిల్లాలోనూ కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షలమంది BSNL కస్టమర్లు ఉన్నారు. ఫైబర్ నెట్ను 28 వేల మంది, ల్యాండ్ లైన్ సేవలను 4500 మంది వినియోగించుకుంటున్నారు. ఒక్క జులైలోనే ఈసంస్థకు 19వేల మంది కస్టమర్లు పెరిగారు. సాధారణ రోజుల్లో నెలకు 5 వేల మంది పెరుగుతుంటారు. త్వరలోనే 4G సేవలు అందుబాటులోకి తెస్తామని తిరుపతి ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ CAరెడ్డి వెల్లడించారు.
Similar News
News January 22, 2026
సెలవుపై వెళ్లిన చిత్తూరు జేసీ

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఈ నెల 21 నుంచి 31వతేదీ వరకు సెలవులో ఉంటారని అధికారులు తెలియజేశారు. జేసీగా ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
News January 22, 2026
ICOC చిత్తూరు ఛైర్మన్గా మనోజ్

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.
News January 22, 2026
చిత్తూరు: రీసర్వేలో రైతుల భాగస్వామ్యం

రీసర్వేలో పలు లోటు పాట్లు చోటు చేసుకుంటుండడంతో వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఇందులో రైతులను భాగస్వామ్యం చేసింది. రీ సర్వే ప్రారంభంలోను, ముగిసిన తర్వాత రైతుల ఈ కేవైసీ తీసుకోవాలని ఆదేశించింది. తద్వారా తప్పులు రైతులు గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నాలుగో విడత రీ సర్వే పలుచోట్ల నిర్వహిస్తున్నారు. 101 గ్రామాలలో 1.15 లక్షల ఎకరాలలో రీ సర్వేను రెవెన్యూ అధికారులు చేపట్టనున్నారు.


