News January 31, 2025

చిత్తూరు: జైలు నుంచి వచ్చి మళ్లీ దొంగతనం

image

చోరీ కేసులో నిందితులను గురువారం చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. DSP సాయినాథ్ వివరాల మేరకు.. గతంలో చిత్తూరులో బైకులు చోరీ చేసిన కేసుల్లో ఏలూరుకు చెందిన గౌస్ మొహిద్దిన్, రైల్వేకోడూరుకు చెందిన మణికంఠ అరెస్ట్ అయ్యారు. కాగా వారు ఈనెల 16న జైలు నుంచి విడుదలై 17న చిత్తూరు సెల్వరాజ్ ఇంట్లో చోరీచేశారు. దీంతో నిందితులని పట్టుకుని 238గ్రాముల వెండి, 65 గ్రాముల బంగారు ఆభరణాలు సీజ్ చేశామన్నారు.

Similar News

News October 16, 2025

17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఈ సమావేశంలో సమీక్షిస్తామని చెప్పారు. సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.

News October 16, 2025

కల్యాణ రేవు జలపాతంలో యువకుడి గల్లంతు

image

పలమనేరు రూరల్ మండలంలో కళ్యాణ రేవు జలపాతంలో గురువారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. పట్టణానికి చెందిన యూనిస్ (23) స్నేహితులతో కలిసి జలపాతం చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు సమాచారం అందించారు. కాగా దట్టమైన అడవిలో నెలకొన్న ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు వర్షం అడ్డంకిగా మారింది. పూర్తి సమాచారం పోలీసులు వెళ్లాడించాల్సి ఉంది.

News October 16, 2025

తోతాపురం సబ్సిడి పడలేదా.. ఇలా చేయండి.!

image

తోతాపూరి మామిడి రైతులకు అందించిన సబ్సిడీపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. తమ సందేహాలను 08572-242777 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చాన్నారు. అర్హత ఉన్నా నగదు జమకాని రైతులు రైతు సేవా కేంద్రాలు, హార్టికల్చర్ కార్యాలయాలలో ఈనెల 30లోపు వినతి పత్రాలు అందజేయాలన్నారు. రెండు రోజుల్లో వాటిని పరిష్కరిస్తామన్నారు.