News April 1, 2025
చిత్తూరు: టెన్త్ పరీక్షలకు 191 మంది గైర్హాజరు

చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. మొత్తం 118 పరీక్షా కేంద్రాల్లో 20,893 మంది విద్యార్థులకు గాను 20,702 మంది పరీక్షలు రాశారని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 31 పరీక్ష కేంద్రాలను చెక్ చేసిందన్నారు. 57 మంది సిట్టింగ్ స్క్వాడ్లు విధులు నిర్వహించారన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని స్పష్టం చేశారు.
Similar News
News January 4, 2026
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

టమాటా ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి.
☞ పుంగనూరులో మొదటి రకం “10 కిలోల” బాక్స్ ధర గరిష్ఠంగా రూ.367, కనిష్ఠ ధర రూ.234
☞ పలమనేరులో గరిష్ఠ ధర రూ. 450, కనిష్ఠ ధర రూ.370
☞వీకోట గరిష్ఠ ధర రూ.420, కనిష్ఠ ధర రూ. 360
☞ కలికిరి గరిష్ఠ ధర రూ.400, కనిష్ఠ ధర రూ. 370
☞ ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.450, కనిష్ఠ ధర రూ. 350 వరకు పలుకుతోంది.
News January 4, 2026
చిత్తూరు: ఉపాధిపై రేపు గ్రామసభలు

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని చెప్పారు. పథకంపై సభలలో అవగాహన కల్పిస్తామన్నారు.
News January 4, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.178 నుంచి రూ.187, మాంసం రూ.258 నుంచి 285 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.294 నుంచి రూ.310 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 96 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


