News November 9, 2024

చిత్తూరు నేతలకు కీలక పదవులు

image

రెండో జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఛైర్మన్‌గా కె.హేమలత నియమితులయ్యారు. ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా నీలాయపాలెం విజయ్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఏపీ యాదవ్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నరసింహ యాదవ్, వన్నెకుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా CRరాజన్‌, నాయీ బ్రహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఆర్.సదాశివకు అవకాశం దక్కింది.

Similar News

News December 20, 2025

చిత్తూరు: రేపు 2 లక్షల మందికి టీకాలు.!

image

ఈఏడాది జిల్లాలో 2,21,502 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజులు ఈ ప్రోగ్రాం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 5,794 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఈ కేంద్రాల వద్ద, మిగిలిన రెండు రోజులు సిబ్బంది ఇంటింటికీ తిరిగి వేయనున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. పేరంట్స్ చిన్నారులకు తప్పక టీకాలు వేయించాలి.

News December 20, 2025

చౌడేపల్లి: ‘సచివాలయ సిబ్బందికి జీతాలు నిలుపుదల’

image

చౌడేపల్లె మండలం చారాల సచివాలయంలోని పలువురి సిబ్బందికి మూడు నెలల జీతాలను నిలుపుదల చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓం ప్రసాద్, కృష్ణమూర్తి, హిమబిందు, సోమశేఖర్, మహమ్మద్ ఆరీఫ్ లకు జీతాలు నిలుపుదల చేయాలని అధికారులు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే వారికి జీతాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

News December 20, 2025

చిత్తూరు: తగ్గుతున్న చెరకు సాగు

image

చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ వాణిజ్య పంటగా ఉన్న చెరకు సాగు క్రమేపి తగ్గుతోంది. సాగు వ్యయం అధికమవుతుండడం, కూలీలు దొరక్క పోవడం, చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు క్రమేపి ఇతర పంటలకు మల్లుతున్నారు. సాగు చేసిన వారు తప్పనిసరిగా బెల్లం తయారు చేయాల్సి వస్తోంది. 2020లో ఉమ్మడి జిల్లాలో 9,900 హెక్టార్లలో చెరకు సాగు కాగా.. ప్రస్తుతం 6,500 హెక్టార్లలో మాత్రమే సాగులో ఉంది.