News February 20, 2025

చిత్తూరు: పకడ్బందీగా పబ్లిక్ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటర్లో 30,652 మంది విద్యార్థులు, పదో తరగతిలో 21,248 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణలో చీటింగ్‌కి పాల్పడితే ఎగ్జామినేషన్ యాక్ట్ కింద చర్యలు తప్పవన్నారు.

Similar News

News February 22, 2025

తవణంపల్లి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి

image

చంద్రగిరి మండలం కాశీపెంట్ల హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్ద రెండు లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తవణంపల్లి మండలం, మారేడుపల్లెకు చెందిన డ్రైవర్ సౌందర్ రాజు (35) గా గుర్తించారు. లారీని పార్క్ చేసి చూసుకొని క్రమంలో మరో లారీ ఢీకొనడంతో లారీల మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీకి తరలించారు.

News February 22, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: చిత్తూరు MP

image

చిత్తూరు పార్లమెంటరీ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో రహదారులు నెత్తురోడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న వరుస ప్రమాదాలతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలన్నారు.

News February 21, 2025

చిత్తూరు: రేపు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

image

జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల22వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సంబంధిత అధికారులు, సభ్యులు తప్పకుండా హాజరవ్వాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

error: Content is protected !!