News July 21, 2024
చిత్తూరు: పదేళ్ల బాలికపై అత్యాచారం

చిత్తూరు జిల్లాలో చిన్నారిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు కూలీ పనులకు వెళ్లారు. వాళ్ల కుమార్తె(10) సచివాలయం వద్ద ఆడుకుంటుండగా తాపీమేస్త్రీ రెడ్డి హుస్సేన్(28) తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తె కనపడలేదు. చివరకు తోటలో ఏడుస్తున్న చిన్నారిని గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు కాగా.. పరారీలో ఉన్నాడు.
Similar News
News November 3, 2025
చిత్తూరు: 90% వైకల్యం ఉన్నా ‘నో పింఛన్’

ఐరాల (M) నెల్లిమందపల్లికి చెందిన నీరిగట్టి గౌతమ్ కుమార్ సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్ను వికలాంగ పింఛను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ధ్రువీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉన్నా.. ఇదివరకు పెన్షన్ మంజూరు కాలేదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, పరిశీలించి పింఛను మంజూరు చేయాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.
News November 3, 2025
అడవి పందుల కోసం వేట.. ఇద్దరి మృతి

బంగారుపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బండ్లదొడ్డి గ్రామపంచాయతీలో వన్య ప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఒక అడవి పంది కూడా చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 3, 2025
చిత్తూరు: వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి పాల్గొన్నారు.


